News January 4, 2025
ఆసీస్కు 200 టార్గెట్ సరిపోదేమో: గవాస్కర్

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు 200 టార్గెట్ సరిపోదేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘బుమ్రా తిరిగి మైదానంలో అడుగు పెడితేనే భారత్కు విజయావకాశాలు ఉంటాయి. ఆయన లేకపోతే 200 లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేం. ప్రస్తుతం బుమ్రా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు ఊహకు అందకుండా బుమ్రా హెల్త్ అప్డేట్ను సీక్రెట్గా ఉంచినట్లు తెలుస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 26, 2025
ఆఫీసు కుర్చీలో నిద్రపోవడం అశుభమా?

ఆఫీసు కుర్చీని సింహాసనంలా భావించాలని పండితులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ఆ కుర్చీపై నిద్రించడం తగదంటున్నారు. ‘ఇది వృత్తి పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలు, అశుభ ఫలితాలను కలిగించే అవకాశముంది. ఇది ప్రగతిని అడ్డుకుని ప్రతికూల శక్తిని పెంచవచ్చు. మీకు అలసటగా ఉంటే నడవడం, ముఖం కడుక్కోవడం, విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకోవడం చేయాలి. కుర్చీలో నిద్రించడం కెరీర్కు మంచిది కాదు’ అంటున్నారు.
News December 26, 2025
వైకల్యం బారిన పడ్డ RTC ఉద్యోగులకు గుడ్న్యూస్

AP: సర్వీసులో వైకల్యం బారిన పడిన RTC ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా ఆర్థిక పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు GO 58 విడుదల చేసింది. 2020 తరువాత సర్వీసులోకి తీసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుంది. అర్హులకు ప్రాధాన్య క్రమంలో కలెక్టర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఉద్యోగాలిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వికలాంగ జాబితాలో లేని వారికి మానిటరీ బెనిఫిట్స్ అందిస్తామని చెప్పారు.
News December 26, 2025
COEకి శ్రేయస్.. న్యూజిలాండ్ సిరీస్కి రెడీనా?

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ ఇవాళ బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(COE)కు వెళ్లారు. OCT 25న ఆస్ట్రేలియాతో మ్యాచ్లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. నాలుగు నుంచి ఆరురోజుల వరకు వైద్యులు అయ్యర్ హెల్త్ని అసెస్ చేసి అతని కంబ్యాక్ని డిసైడ్ చేస్తారు. ఇటీవల బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్కు అందుబాటులోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


