News August 24, 2024
భారత్కంటే అఫ్గాన్ సురక్షితమేమో.. అర్షద్ ట్వీట్ వైరల్!
రెబల్స్టార్ ప్రభాస్పై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీని సినీ అభిమానులు వదలడం లేదు. 2012లో ఆయన చేసిన ట్వీట్ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ‘రేపు ఉదయం అఫ్గాన్ అధ్యక్షుడిని మీట్ అవుతున్నా. నేను ఆ దేశానికి షిఫ్ట్ అయితే బెటరేమో. భారత్ కంటే అక్కడే సురక్షితం’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో అర్జంట్గా అఫ్గాన్ షిఫ్ట్ అయిపో అంటూ నెటిజన్లు ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 13, 2024
బంగ్లాపై భారత్ సునాయాసంగా గెలుస్తుంది: దినేశ్ కార్తీక్
బంగ్లాదేశ్తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.
News September 13, 2024
‘దేవర’లో 4 సీన్లపై సెన్సార్ అభ్యంతరాలు?
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి U/A సర్టిఫికెట్ లభించినట్లు ‘బాలీవుడ్ హంగామా’ పేర్కొంది. 4 సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని తెలిపింది. ఓ పాత్ర తన భార్యను, మరో పాత్ర తన తల్లిని తన్నిన సీన్లను మూవీ టీం మార్చింది. ఇక కత్తిపై శరీరం వేలాడుతున్న ఓ సీన్ తొలగించారు. ఎన్టీఆర్ సొరచేపపై ప్రయాణించిన సన్నివేశంలో అది CGI షార్క్ అన్న టిక్కర్ వేయాలని బోర్డు సూచించింది.
News September 13, 2024
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో బాబు ఫెయిల్: విజయసాయిరెడ్డి
AP: విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్-3 ఆపివేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని YCP MP విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్లాంట్ను కాపాడడంలో CM చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ‘అందరూ భయపడినట్లే జరిగింది. బాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది తెలుగు జాతికి అతి పెద్ద ద్రోహం. దీనిని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని నేరం’ అని ఆయన ఎక్స్లో మండిపడ్డారు.