News June 29, 2024

అయ్యన్నపాత్రుడు అంటే జగన్‌కు భయమేమో?: మంత్రి అనిత

image

AP: అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా ప్రకటించినప్పటి నుంచి జగన్ అసెంబ్లీకి రాలేదని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆయనంటే YCP చీఫ్‌కు భయమేమోనన్నారు. స్పీకర్‌కు సన్మానసభలో ఆమె మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ నాకంటే అయ్యన్న వద్ద ఉంటేనే బాగుండేది’ అని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. DEC 4తో గడువు ముగియగా.. DEC 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.

News December 5, 2025

PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

image

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

News December 5, 2025

పండ్లు, కూరగాయలు తినే ముందు ఇది గుర్తుంచుకోండి

image

వ్యవసాయంలో అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందుల వాడకం ఎక్కువైంది. పంటకాలం పూర్తై, విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయల నుంచి తొలగిపోవు. అందుకే మనం తినే ముందు వీటిని తప్పనిసరిగా శుభ్రం చేసి తినాలి. లేకుంటే ఈ అవశేషాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది.