News October 8, 2024

ECపై BJP ఒత్తిడి చేస్తోందా: జైరామ్ రమేశ్

image

ఓట్ల లెక్కింపు తాజా వివరాలను వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్‌పై బీజేపీ ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తోందా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. ‘లోక్‌సభ ఎలక్షన్స్ తరహాలోనే అప్ టు డేట్ ట్రెండ్స్‌ను ECI వెబ్‌సైట్లో ఆలస్యంగా అప్‌డేట్ చేయడాన్ని గమనిస్తున్నాం. ఔట్ డేటెడ్, మిస్ లీడింగ్ ట్రెండ్స్‌ను షేర్ చేసేలా ECపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 19, 2025

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TGలో రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మిగతా చోట్ల సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 22-24 మధ్య అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

News November 19, 2025

హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

image

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.

News November 19, 2025

హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్.. భారీగా నగదు పట్టివేత

image

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ <<18317664>>సోదాల్లో<<>> భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.