News September 21, 2024

నెయ్యి కల్తీ అయిందా? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

image

☛ స్వచ్ఛమైన నెయ్యి గోల్డ్ కలర్‌లో, మృదువుగా, సువాసనతో, రుచికరంగా ఉంటుంది.
☛ గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. పూర్తిగా కరిగిపోతే అది ప్యూర్ అని, వాటర్‌లో ఏమైనా అవశేషాలు కనిపిస్తే అది కల్తీ అని అర్థం.
☛ ప్యూర్ నెయ్యి వేడి చేస్తే వెంటనే కరిగిపోతుంది. పొగ, కాలిన వాసన ఎక్కువగా రాదు.
☛ ఫ్రిడ్జ్‌లో కొన్ని గంటలపాటు ఉంచితే నెయ్యంతా ఒక్కటిగా గడ్డకడుతుంది. అలా జరగలేదంటే అది ప్యూర్ కాదు.

Similar News

News November 24, 2025

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని పెద్దపల్లి ఎంపీ

image

పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరు కాలేదు. గతంలో కాళేశ్వరం పుష్కరాలు, ఈఎస్ఐ ఆసుపత్రి కార్యక్రమాల్లోనూ ఎంపీని పక్కనపెట్టిన ఘటనలు ఉన్న నేపథ్యంలో, తాజా పరిణామం ఎమ్మెల్యేలు-ఎంపీ మధ్య సమన్వయ లోపాన్ని మరింత స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనకపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

News November 24, 2025

రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

image

హైదరాబాద్‌లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్‌పై ఈ రైడ్స్ జరిగాయి.

News November 24, 2025

యూకేని వీడనున్న మిట్టల్!

image

భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ యూకేని వీడనున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్, ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా యూకేలో పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పన్నులు లేని దుబాయ్‌లో సెటిల్ కానున్నారు. ఇప్పటికే అక్కడ ఓ ల్యాండ్ కొన్నారు. కాగా మిట్టల్ $21.4 బిలియన్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.