News April 7, 2025
తులం బంగారం రూ.56వేలు కాబోతోందా..?

రానున్న రోజుల్లో పసిడి ధర 38% మేర పతనం అవుతుందని అంచనా వేస్తున్నట్లు USA అనలిస్ట్ జాన్ మిల్స్ వెల్లడించారు. అమెరికాలో ఇప్పుడు $3080గా ఉన్న ఔన్స్ పుత్తడి $1820కు దిగి రావచ్చన్నారు. అంటే మన దగ్గర 10గ్రా. ₹56వేలకు వస్తుందన్నమాట. బంగారం సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడం, మార్కెట్ పరిస్థితులు దీనికి కారణాలుగా పేర్కొన్నారు.
NOTE: ఇది మిల్స్ అంచనా. అన్ని పరిశీలించి కొనుగోలు/అమ్మకాల నిర్ణయం తీసుకోండి.
Similar News
News November 25, 2025
హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాల చేయూత

గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ వాట్సప్ నెంబర్: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాధితులు 181, 1091, 100 నంబర్లకు ఫోన్ చేస్తే తక్షణం పోలీస్ సాయం అందుతుంది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
News November 25, 2025
సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.
News November 25, 2025
పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.


