News August 8, 2024

వినేశ్ కేసు వాదించే లాయర్ ఈయనే?

image

ఒలింపిక్స్ నుంచి డిస్‌క్వాలిఫై చేయడంపై వినేశ్ ఫొగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో వేసిన కేసు రేపు విచారణకు రానుంది. ఆమె తరఫున వాదించడానికి ప్రముఖ లాయర్‌ హరీశ్ సాల్వేను భారత ప్రభుత్వం నియమించింది. అయితే అందుకు ఆయన అంగీకరించాల్సి ఉంది. గతంలో పాక్ బందీ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించారు. అందుకు రూపాయి ఫీజు తీసుకున్నారు. హైప్రొఫైల్ కేసులు వాదించడంలో సాల్వే దిట్ట.

Similar News

News November 18, 2025

‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

News November 18, 2025

‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

News November 18, 2025

వందల మంది మృతికి హిడ్మానే కారణం!

image

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్‌ ఘాట్‌లో కాంగ్రెస్‌ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్‌లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి