News April 23, 2025
పాకిస్థాన్కు భారత్ దెబ్బ?

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.
Similar News
News April 23, 2025
పహల్గామ్ దాడి.. కావలి వ్యక్తి బాడీలో 42 బుల్లెట్లు!

పహల్గామ్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. AK-47తో ఆయనను వెంటాడి వేటాడి చంపినట్లు సమాచారం. కాగా మధు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. హాలిడే ట్రిప్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లి ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
News April 23, 2025
ఆ సమయంలో ఫోన్ వాడకండి!

వేసవి కావడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్లు పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే సెల్ఫోన్తో జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడికి ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి. ఆ సమయంలో మొబైల్కు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఫోన్ వాడకూడదు. చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి, బ్యాటరీ కూల్ అయ్యాకే వినియోగించాలి.
News April 23, 2025
SRH 4 వికెట్లు డౌన్

MIతో జరుగుతున్న మ్యాచ్లో SRH టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హెడ్, కిషన్, అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి వెంటవెంటనే వెనుదిరిగారు. ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్పై ఇలాంటి బ్యాటింగ్ ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4.1 ఓవర్లకు SRH స్కోర్ 13/4.