News October 18, 2024
ఒంటరిగా మారుతోన్న భారత్?
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో భారత్ తన వైఖరి తేల్చిచెప్పలేకపోతోంది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఖండిస్తున్నా, మన దేశం మాత్రం ఐక్యరాజ్యసమితిలో తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతోంది. చివరకు నాటో దేశాలు కూడా పాలస్తీనా మారణహోమంపై ఇజ్రాయెల్ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో ఇండియా ఒంటరి అవుతున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 18, 2024
ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. హమాస్ టాప్ కమాండర్లందరూ హతం
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మరణించారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. దీంతో గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ హమాస్ అగ్రనేతలందరినీ చంపుతామని ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఒక్కొక్కరిని వేటాడుతూ మట్టుబెట్టింది. మహమ్మద్ డైఫ్, ఇస్మాయిల్ హనియే, మర్వాన్ ఇస్సా, రాద్ సాద్, సలేహ్ అల్-అరౌరీ, యాహ్యా సిన్వార్ ఇలా టాప్ కమాండర్లందరినీ చంపేసింది.
News October 18, 2024
నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
TG: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి కోర్టుకు చేరుకుంటారు.
News October 18, 2024
నేడు స్కూళ్లకు సెలవు ఉందా?
AP: వాయుగుండం వల్ల భారీ వర్షాలు కురవడంతో గత 3, 4 రోజులుగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నిన్న వాయుగుండం తీరం దాటడంతో అతిభారీ వర్షాల ముప్పు తగ్గిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.