News March 11, 2025
సంతాన ప్రాప్తి కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కత్రినా?

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సందర్శించారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక నాగపూజలో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అయితే, సంతాన ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సర్పాలకు అధిపతి అయిన కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నారు. సంతాన ప్రాప్తికోసం, ఇతర సర్ప దోషాల నివారణకు అనేకమంది ఇక్కడికి వెళ్తుంటారు.
Similar News
News December 22, 2025
PCOSని ఎలా కంట్రోల్ చెయ్యాలంటే?

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇటీవల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వయసు, బరువుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే సరైన బరువును మెయింటైన్ చేయడం, మైండ్ ఫుల్ ఈటింగ్, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు వాడటం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
News December 22, 2025
శబరిమల భక్తులకు ‘కేరళ సద్య’

శబరిమలలో అయ్యప్ప భక్తులకు సంప్రదాయ కేరళ సద్య(విశేష విందు) పంపిణీ ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపప్రజ్వలన చేసి స్వామికి నివేదించారు. అనంతరం భక్తులకు వడ్డించారు. ఇందులో రైస్, పప్పు, సాంబార్, రసం, రెండు రకాలు కేరళ స్టైల్ కర్రీస్, పచ్చడి, అప్పడం, పాయసం వంటి వంటకాలు ఉంటాయి. రోజుకు 5,000 మందికిపైగా భక్తులకు రోజు విడిచి రోజు సద్య, మధ్యలో పులావ్ను భక్తులకు వడ్డించనున్నారు.
News December 22, 2025
తప్పు చేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలదే: పొన్నం

TG: ఉనికిని కాపాడుకునేందుకే <<18633627>>KCR<<>> నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏమీ లేకుండా చేశారు. తప్పుచేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. గత పాలకుల నిర్వాకంతో కలిగిన ఇబ్బందులను మేము సరిచేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలని కోరుతున్నాం’ అని గాంధీభవన్లో చెప్పారు.


