News May 26, 2024
సోమిరెడ్డి ఓటర్లకు డబ్బు పంచితే మానవతా దృక్పథమా?: కాకాణి

AP: కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసులు YCP కేడర్ను భయబ్రాంతులకు గురి చేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. EC నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని విమర్శించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్ట పగలు ఓటర్లకు డబ్బు పంచడంపై ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని మండిపడ్డారు. మానవతా దృక్పథంతో డబ్బు ఇచ్చారనడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
Similar News
News December 10, 2025
గొడవలు ఎందుకొస్తాయంటే?

ఏ రిలేషన్షిప్లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.
News December 10, 2025
కాశీలో శని దోషాలు పోగొట్టే ఆలయం

కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి ఆలయాలతో పాటు అన్నపూర్ణాదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆహారానికి లోటుండదని నమ్మకం. అలాగే సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే సంకటాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు పోతాయని అంటున్నారు. భక్తులు మణికర్ణికా, దశాశ్వమేధ ఘాట్లు దర్శించి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.
News December 10, 2025
25వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం SSC నోటిఫికేషన్ జారీ చేసింది. BSF, ITBP, SSB, CRPF, SSF, AR, CISF విభాగాలన్నింటికీ కలిపి 25,487 ఖాళీలు భర్తీ చేయనుంది. 2026 JAN1 నాటికి టెన్త్ పాసైన 18-23సం.ల మధ్య వయస్సు గల వారు దరఖాస్తుకు అర్హులు. DEC 1 నుంచి మొదలైన <
Share It


