News May 26, 2024
సోమిరెడ్డి ఓటర్లకు డబ్బు పంచితే మానవతా దృక్పథమా?: కాకాణి

AP: కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసులు YCP కేడర్ను భయబ్రాంతులకు గురి చేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. EC నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని విమర్శించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్ట పగలు ఓటర్లకు డబ్బు పంచడంపై ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని మండిపడ్డారు. మానవతా దృక్పథంతో డబ్బు ఇచ్చారనడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
Similar News
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.
News December 11, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


