News March 19, 2025

పాత కార్లు ఉంటే దెబ్బేనా?

image

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పాత వాహనాలకు ఇంధనం అమ్మరు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పటికే ఢిల్లీలో నిషేధం అమలవుతోంది. MHతో పాటు మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

Similar News

News March 19, 2025

దేశంలోనే అత్యంత ధనిక MLA ఇతనే

image

దేశంలోని 4,092 MLAల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా(BJP) దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. రూ.3,400 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.1,413 కోట్లతో కర్ణాటక Dy.CM DK శివకుమార్(INC) రెండో స్థానంలో నిలిచారు. రూ.1,700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా(BJP) నిలిచారు.

News March 19, 2025

ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 25, 26 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, పీ4 విధానంపై చర్చించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, అర్హులకు పథకాల అందజేత, ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

News March 19, 2025

ఎంతిస్తారో కూడా నాకు చెప్పలేదు: శశాంక్ సింగ్

image

రిటెన్షన్‌లో తనకు ఎంత ఇస్తారో కూడా తెలియకుండానే సంతకం చేశానని PBKS ప్లేయర్ శశాంక్ సింగ్ తెలిపారు. తాను వేలంలో లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ‘గతంలో చాలాసార్లు నన్ను వేలంలో తిరస్కరించారు. తీసుకున్నా అవకాశాలు వచ్చేవి కావు. గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో రిటైన్ చేసుకున్నారు. రిటైన్ సమయంలో నాకు ఎంత ఇచ్చేది వారు చెప్పలేదు. నేనూ బేరమాడలేదు. ఫామ్‌పై సంతకం చేశా అంతే’ అని చెప్పుకొచ్చారు.

error: Content is protected !!