News August 20, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇవాళ APలో ఎక్కడా స్కూళ్లకు సెలవు ప్రకటించలేదు. TGలో మాత్రం ఒక్క నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా హాలిడే ఇచ్చారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా పాఠశాలలు నడవనున్నాయి. అయితే KMM, ములుగు, భూపాలపల్లి, ADB, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News March 19, 2026
అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 19, 2026
జ్యోతిషుడు అరెస్టు.. మహిళలతో 58 అసభ్యకర వీడియోలు

మహారాష్ట్రలో ‘ఎప్స్టీన్ ఫైల్స్’ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు. అశోక్ గతంలో నేవీలో పని చేశాడు. ఇతడికి MH రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి.
News March 19, 2026
సరఫరా కాదు డిస్ట్రిబ్యూషన్లోనే సమస్య: కేంద్రం

దేశంలో LPG సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని.. డిస్ట్రిబ్యూషన్లోనే సమస్య ఉందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే క్షేత్రస్థాయిలో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొంది. దీనిపై డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు అప్పీల్ చేశామని తెలిపింది. నిన్న టోటల్ బుకింగ్స్ 56లక్షలుగా ఉండగా సప్లై సంఖ్య 54,91,000గా ఉన్నట్లు తెలిపింది.


