News January 2, 2025

రైతు భరోసాకూ దరఖాస్తులా? దారుణం: కవిత

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తోందని MLC కవిత ఆరోపించారు. ఇప్పటికే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించారని, ఇప్పుడు రైతు భరోసాకు కూడా అప్లికేషన్లు తీసుకోవడం దారుణమని అన్నారు. ‘రైతులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఉంటారా? ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Similar News

News October 22, 2025

రేపు జగన్ మీడియా సమావేశం

image

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

News October 22, 2025

బంగ్లా నేవీ అధీనంలో 8మంది AP మత్స్యకారులు

image

పొరపాటున తమ జలాల్లోకి ప్రవేశించిన విజయనగరానికి చెందిన 8మంది మత్స్యకారులను బంగ్లా నేవీ అదుపులోకి తీసుకుంది. భోగాపురం మం. కొండ్రాజుపాలెంకి చెందిన మరుపుల్లి చిన్న అప్పన్న, రమేశ్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్నఅప్పన్న, రాము, పూసపాటిరేగ మం. తిప్పలవలసకి చెందిన రమణ, రాము విశాఖలోని పోర్ట్ ఏరియాలో ఉంటున్నారు. ఈనెల 13న వేటకు వెళ్లగా.. దారి తప్పి 14న అర్ధరాత్రి 2 గం.కు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు.

News October 22, 2025

భారీ వర్షసూచన.. మరో 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: రాయలసీమతో పాటు పలు జిల్లాలకు వాతావరణశాఖ రేపు భారీ వర్షసూచన చేసింది. ఈ నేపథ్యంలో మరో 2 జిల్లాల స్కూళ్లకు సెలవులిచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కడప డీఈవో శంషుద్దీన్, అన్నమయ్య డీఈవో సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు రేపు స్కూళ్లకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ GNT, కృష్ణా, చిత్తూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.