News March 24, 2024
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సులభమేనా?

ఢిల్లీ CM కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జైలులో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో సీఎం నేరుగా పాల్గొనడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, ఫైళ్లను తనిఖీ చేయడం సులభం కాదని, ఆయనను కలవాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి ఉండాలని చెబుతున్నారు. పాలకుడు ప్రజల్లోనే ఉండాలని, కేజ్రీవాల్ మరొకరిని సీఎంగా నామినేట్ చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News December 16, 2025
Photos: వనతారలో మెస్సీ పూజలు

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.
News December 16, 2025
మోదీ గొప్ప స్నేహితుడు: ట్రంప్

భారత్తో పాటు ప్రధాని మోదీపై US అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఇండియా ఒకటి. ఇది అద్భుత దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. మనకు PM మోదీ అనే గొప్ప స్నేహితుడు ఉన్నారు’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఇండియాలోని US ఎంబసీ ట్వీట్ చేసింది. ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ కోసం అమెరికా బృందం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
News December 16, 2025
‘సబ్కా బీమా సబ్కీ రక్ష’లో ముఖ్యమైన అంశాలు ఇవే!

2047కు ఇన్సూరెన్స్ రంగ అభివృద్ధి టార్గెట్గా సబ్కా బీమా సబ్కీ రక్ష (ఇన్సూరెన్స్ Laws అమెండ్మెంట్ బిల్-2025)ను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. FDIల పరిమితి 74%-100%కి పెంపు, ఛైర్మన్, MD, CEOలలో ఒకరు ఇండియన్ సిటిజన్, సైబర్, ప్రాపర్టీ రంగాలకు లైసెన్సులు, ఇన్సూరెన్స్, నాన్-ఇన్సూరెన్స్ కంపెనీ మెర్జర్లకు అనుమతి, పాలసీ హోల్డర్ రక్షణకు ప్రత్యేక ఫండ్ వంటి మార్పులు బిల్లో పొందుపరిచింది.


