News January 12, 2025
క్షమాపణ చెప్తే సరిపోతుందా?.. YS జగన్ ఫైర్

AP: తిరుమల తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన TTD ఛైర్మన్, EO, JEO, కలెక్టర్, SPపై కఠిన చర్యలు తీసుకోవాలని YS జగన్ డిమాండ్ చేశారు. వారిపై కేసులు పెట్టి దేవునిపై ఉన్న భక్తిని CM చాటుకోవాలన్నారు. ‘Dy.CM క్షమాపణలు చెప్పాలంటున్నారు. ఆరుగురు చనిపోతే ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? CM, Dy.CM రాజకీయ డ్రామాలు ఆపేయాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 24, 2025
యథావిధిగా జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గం: నుంచి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా కార్యాలయాలకు రాలేని పక్షంలో https://meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, 1100 నంబర్ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు.
News November 24, 2025
TODAY HEADLINES

* వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం: మోదీ
* సింధ్ మళ్లీ INDలో కలవొచ్చు: రాజ్నాథ్
* AP: తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు
* సత్యసాయి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి: CBN
* బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలి: రేవంత్
* ‘రైతన్నా.. మీకోసం’ పబ్లిసిటీ స్టంటే: జగన్
* అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR
* రేషన్కార్డు ఉన్న మహిళలకు ఫ్రీగా చీరలు: పొన్నం
* SAతో ODI సిరీస్కు కెప్టెన్గా కేఎల్
News November 24, 2025
ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకున్నా: మారుతి

ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకొని పనిచేశానని, ఆయన ఫొటో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అయిపోతారని మారుతి అన్నారు. ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ సందర్భంగా మాట్లాడారు. ‘ఫ్యాన్స్ కోసమే ప్రభాస్ <<18369126>>ఈ పాట <<>>చేశారు. కేరింతలతో థియేటర్స్ రీసౌండ్ వస్తాయి. ముగ్గురు హీరోయిన్స్తో ఆయన కెమిస్ట్రీ స్క్రీన్పై చూడాలి. రిలీజ్కు ముందే అందరూ రెబల్ ఆరాలో ఉంటారు. ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకునే వర్క్ చేస్తున్నా’ అని చెప్పారు.


