News March 16, 2025

ట్యాంక్ బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా: బండి

image

TG: పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన గొప్ప దేశభక్తుడని, ఏపీ మూలాలుంటే పేర్లను మార్చేస్తారా అని నిలదీశారు. NTR, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మారుస్తారా అని అన్నారు. ట్యాంక్ బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు. తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.

Similar News

News October 29, 2025

వైఫల్యాలు విజయాలకు మెట్లు!

image

మీరు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని బాధపడుతున్నారా? విజయం పొందలేమని ఆందోళన చెందుతున్నారా? మీలానే సర్ జేమ్స్ డైసన్ అనుకుని తన ప్రయత్నాలను ఆపితే బ్యాగ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్‌ రూపొందేదా? ఆయన ఏకంగా 5,126 సార్లు విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన స్థాపించిన డైసన్ లిమిటెడ్ కంపెనీ వార్షికాదాయం ₹75,300 కోట్లు. వైఫల్యం అనేది ఆగిపోవడానికి సంకేతం కాదు.. ఇది విజయానికి మెట్టు అని గుర్తుంచుకోండి.

News October 29, 2025

పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: CBN

image

AP: వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వేగంగా చేపట్టాలని CM CBN ఆదేశించారు. నీరు నిలవకుండా డ్రైనేజీల్ని పటిష్ఠం చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి నిత్యావసరాలు అందించాలన్నారు. కాగా రాష్ట్రంలో 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని అధికారులు వివరించారు.

News October 29, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. BJP అభ్యంతరం!

image

TG: అజహరుద్దీన్‌కు <<18140326>>మంత్రి<<>> పదవి ఖాయమని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చాక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.