News August 13, 2024
11 సీట్లు ఇచ్చినా సిగ్గు రాలేదా జగన్?: లోకేశ్

AP: ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేశారన్న జగన్ <<13841981>>వ్యాఖ్యలకు<<>> మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచేందుకు 5 ఏళ్లు తీసుకొని సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా అని Xలో ప్రశ్నించారు. పాపాలలో శిశుపాలుడిని మించిన జగన్ మోసాలకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా సిగ్గు రాలేదని దుయ్యబట్టారు. బాబాయ్ని వేసేయడం, గంజాయి అమ్ముకోవడం వంటివి సాగకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్టా అని ప్రశ్నలు సంధించారు.
Similar News
News December 7, 2025
NMMS పరీక్షకు 86 మంది గైర్హాజరు: DEO

జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన జాతీయ ఉపకార వేతన(NMMS) పరీక్షను ఆదివారం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో వెల్లడించారు. 2654 మంది విద్యార్థులు హాజరుకాగా, 2568 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 86 మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు.
News December 7, 2025
ఇంగ్లండ్ చెత్త రికార్డు

యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్గా జో రూట్ ఖాతాలో అన్వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.
News December 7, 2025
సైనికుల క్రమశిక్షణ, సామర్థ్యం చూశాం: రాజ్నాథ్ సింగ్

‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ చూశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పరాక్రమంతో పాటు సంయమనం కూడా చూపారని గుర్తుచేశారు. ఎంత కావాలో అంతే చేశారని, అనుకుంటే మరింత చేసేవారన్నారు. బార్డర్లో మెరుగైన కనెక్టివిటీ భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతోందని చెప్పారు. BRO పూర్తి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్నాథ్ ఈ కామెంట్లు చేశారు.


