News August 1, 2024
కమల ఇండియనా లేక నల్లజాతి మహిళా?: ట్రంప్

US అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఆమె ఎప్పుడూ ఇండియన్ వారసత్వాన్నే ప్రచారం చేశారు. ఇప్పుడు సడన్గా నల్లజాతి మహిళగా పిలిపించుకోవాలనుకుంటున్నారు. కమల ఇండియన్ లేదా బ్లాక్ అనే విషయం నాకు తెలియదు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైట్హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పేర్కొంది.
Similar News
News December 16, 2025
ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు?

TG: వచ్చే ఏడాది APR నుంచి పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధ్యాప్య, వితంతు తదితర పెన్షనర్లు 44లక్షల మంది ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వారికోసం ₹11,635Cr కేటాయించింది. పెంపు జరిగితే ₹22K Cr కావాల్సి ఉండగా నిధుల సమీకరణ మార్గాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఒకేసారి పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయనుంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ ₹2,016 ఇస్తుండగా హామీ మేరకు ₹4వేలు చేయాల్సి ఉంది.
News December 16, 2025
ధనుర్మాసం ఆరంభం.. విష్ణుమూర్తికి పూజ చేస్తే!

విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. ఈ నెల రోజులు భక్తులు కఠిన నియమాలను పాటిస్తూ శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందే పూజలు చేస్తుంటారు. దైవారాధనకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ధనుర్మాస వ్రతనిష్ఠతో విష్ణులోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
News December 16, 2025
విజయ్ దివస్.. యుద్ధ వీరులకు మోదీ, రాజ్నాథ్ నివాళులు

1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భారత్కు విజయాన్ని అందించిన సాయుధ దళాలను ‘విజయ్ దివస్’ సందర్భంగా PM మోదీ స్మరించుకున్నారు. ఇది దేశ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగాలు దేశాన్ని కాపాడాయని, ఈ విజయం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని Xలో ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తూ.. ఈ విజయం త్రివిధ దళాల సమన్వయానికి ప్రతీక అని అన్నారు.


