News April 11, 2025

భూ దోపిడీపై KTR చర్చకు సిద్ధమా?: మహేశ్

image

IMG బిల్లీరావు దగ్గర కమీషన్ తీసుకున్నందుకే కంచ గచ్చిబౌలి భూముల కోసం BRS పోరాడలేదని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలు సాధించిందని, వాటిలో కంపెనీలు నిర్మిస్తే యువతకు ఉద్యోగాలొస్తాయన్నారు. గత ప్రభుత్వం కోకాపేటలో వేల ఎకరాలు అమ్ముకోగా, లక్షఎకరాలు డీఫారెస్ట్ చేసిందన్నారు. BRS హయాంలో జరిగిన భూదోపిడీపై KTR చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

Similar News

News November 8, 2025

రాజ్‌తో ఫొటో వైరల్.. సమంత రెండో పెళ్లిపై చర్చ!

image

సమంత నిన్న రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న <<18228781>>ఫొటోను<<>> షేర్ చేయడంతో పెళ్లి ఎప్పుడనే చర్చ మొదలైంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ నుంచి సమంత, రాజ్ స్నేహం మొదలైంది. అప్పటినుంచి వీరిద్దరూ డేట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని బాలీవుడ్ మీడియా ఎప్పటినుంచో కోడై కూస్తోంది.

News November 8, 2025

రబీ వరి సాగు విధానం.. విత్తన మోతాదు

image

☛ నారు నాటే పద్ధతి – 20 కిలోల విత్తనం అవసరం.
☛ ఎద పద్ధతి – 12-15 కిలోలు(మండి కట్టిన విత్తనం), 25-30 కిలోలు( పొడి విత్తనం)
☛ శ్రీవరి సాగు పద్ధతి – 2 కిలోల విత్తనం అవసరం.
☛ యాంత్రిక పద్ధతిలో వరి సాగుకు 10-12 కిలోల విత్తనం
☛ బెంగాల్ పద్ధతిలో వరి సాగు 8-10 కిలోల విత్తనం కావాలి.
☛ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. కిలో పొడి విత్తనాలకు 3గ్రాముల కార్బండిజమ్‌తో శుద్ధి చేయాలి.

News November 8, 2025

ఆలయాల్లో డిజిటల్ సేవలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

image

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో డిజిటల్ సేవలను పెంచాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దర్శనం, సేవల టికెట్లను సులభంగా పొందేలా 100 కియోస్క్‌లను ఏర్పాటుచేయనుంది. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గనుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితోపాటు అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి తదితర 15 ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.