News September 7, 2025
ఎట్టకేలకు మణిపుర్కు ప్రధాని మోదీ?

ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న ఆయన అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. పీఎం పర్యటనకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపుర్ అల్లర్లు చెలరేగినప్పటి నుంచి మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. దీంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Similar News
News September 7, 2025
మంత్రి లోకేశ్పై అంబటి సెటైర్లు

AP: పలువురు లిక్కర్ కేసు నిందితులు బెయిల్పై విడుదలవ్వడంపై YCP నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ‘నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు’ అంటూ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేసి సెటైర్లు వేశారు.
News September 7, 2025
రూ.27 వేలతో ఆ దేశంలో శాశ్వత నివాసం

విదేశీయులు రూ.27 వేలకే పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు బ్రెజిల్ అనుమతి ఇస్తోంది. 2 వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కూడా ముందుగా తాత్కాలిక నివాసానికి అర్హులవుతారు. ఆ తర్వాత పర్మినెంట్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చు. పాస్పోర్టు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, లీగల్ ఎంట్రీ, జాబ్ లేదా ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ ఉంటే శాశ్వత నివాస హక్కు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తానికి 4 నుంచి 6 నెలలు పడుతుంది.
News September 7, 2025
రానున్న 2గంటల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, హన్మకొండ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.