News November 16, 2024
జో బైడెన్లాగే మోదీకీ మతిపోయిందేమో: రాహుల్

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్లానే ప్రధాని మోదీకి మెమరీ లాస్ అయిందని LoP రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని పేర్కొంది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో’ అని మహారాష్ట్ర సభలో అన్నారు.
Similar News
News February 6, 2026
నాగాలాండ్లో కీలక ఒప్పందం.. అసలేంటిది?

తూర్పు నాగాలాండ్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అమిత్ షా సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది. కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ల మధ్య ఇది కుదిరింది. ఇందులో భాగంగా స్వయం ప్రతిపత్తితో ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ(FNTA) ఏర్పాటవుతుంది. మినీ సెక్రటేరియట్ ద్వారా ఆరు జిల్లాలను అభివృద్ధి చేస్తారు. 8 ప్రధాన నాగా తెగల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు.
News February 6, 2026
INDతో మ్యాచ్.. పాక్ యూటర్న్ కన్ఫర్మ్: చేతన్ శర్మ

T20 WCలో భాగంగా ఈ నెల 15న భారత్తో మ్యాచును బాయ్కాట్ చేస్తామని పాక్ చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా డ్రామా అని, ఈ నెల 12 తర్వాత PCB యూటర్న్ తీసుకుంటుందని BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అన్నారు. ‘ఈ నెల 12న బంగ్లాదేశ్ ఎలక్షన్స్ ఉండటంతో రాజకీయ లబ్ధి కోసం ఈ డ్రామా ఆడుతున్నారు. ఎన్నికల తర్వాత క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు.. మ్యాచ్ ఆడండి అంటూ ప్రకటన వస్తుంది’ అని పేర్కొన్నారు.
News February 6, 2026
‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ఎక్కడ నమోదు చేస్తారు? ఏ పత్రాలు కావాలి?

తెలంగాణలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణా అధికారి(AEO) ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లిస్తే నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో సచివాలయంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. దీని కోసం ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ ఉండాలి. వీటిని తీసుకొని రైతులు పైన సూచించిన కేంద్రాలకు వెళ్లాలి.


