News November 16, 2024
జో బైడెన్లాగే మోదీకీ మతిపోయిందేమో: రాహుల్

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్లానే ప్రధాని మోదీకి మెమరీ లాస్ అయిందని LoP రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని పేర్కొంది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో’ అని మహారాష్ట్ర సభలో అన్నారు.
Similar News
News January 29, 2026
మొక్కజొన్న పంటకు నీరు – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మొక్కజొన్న పూత దశలో నీటి ఎద్దడి వల్ల మగపూలు, పీచు ఎండిపోయి, పరాగ సంపర్కం సరిగా జరగక, పై ఆకులు ఎండిపోయి కండెలో గింజల సంఖ్య, పరిమాణం తగ్గుతుంది. పంట పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైతే 40 నుంచి 80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. అందుకే పంట ఎదిగే దశలో ఎక్కువ వ్యవధితో, పూత దశలో తక్కువ వ్యవధితో నీరు పెట్టాలి.
News January 29, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.
News January 29, 2026
ఈరోజు అన్నం తినకూడదా?

నేడు భీష్మ ఏకాదశి. ఈ తిథి నాడు అన్నం తినొద్దంటారు. అందుకు 3 కారణాలున్నాయి. ఏకాదశి నాడు పాపపురుషుడు బియ్యంలో ఉంటాడని, దాంతో వండిన పదార్థాలు తింటే చెడు జరుగుతుందని భవిష్య పురాణం చెబుతోంది. బియ్యంలోని తామసిక లక్షణాలు బద్ధకాన్ని పెంచుతాయి. పూజలకు ఆటంకం కలిగిస్తాయి. చంద్రుడి ప్రభావంతో జీర్ణక్రియ మందగిస్తుందని కూడా అంటారు. ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.


