News November 16, 2024
జో బైడెన్లాగే మోదీకీ మతిపోయిందేమో: రాహుల్

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్లానే ప్రధాని మోదీకి మెమరీ లాస్ అయిందని LoP రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని పేర్కొంది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో’ అని మహారాష్ట్ర సభలో అన్నారు.
Similar News
News January 6, 2026
ఏడిస్తే ముక్కు ఎందుకు కారుతుందో తెలుసా?

మానవ శరీర వ్యవస్థ ఒక ఇంజినీరింగ్ అద్భుతం. మన కంటి మూలలో సూది మొనంత ఉండే ‘లాక్రిమల్ పంక్టం’ అనే రంధ్రం ఒక అదృశ్య డ్రైనేజీ పైపులా పనిచేస్తుంది. కళ్లలో ఊరే అదనపు కన్నీళ్లను ఇది ముక్కులోకి పంపిస్తుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. ఈ చిన్న రంధ్రం కంటి తేమను కాపాడుతూ చూపును స్పష్టంగా ఉంచుతుంది. అంటే మనం ఏడుస్తున్నప్పుడు ముక్కు నుంచి కారేది ‘కన్నీళ్లే’. share it
News January 6, 2026
పరకామణి అంశంలో పోలీసు అధికారులపై కేసులకు హైకోర్టు ఆదేశం

AP: TTD పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీ, సీఐడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని ఆ రెండు విభాగాలకు స్పష్టం చేసింది. పరకామణి లెక్కింపు అంశంలో విధివిధానాలు ఖరారు చేయాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.
News January 6, 2026
EVలపై ప్రభుత్వోద్యోగులకు 20% రాయితీ ఇవ్వాలి: పొన్నం

TG: కాలుష్య నివారణకోసం ఎలక్ట్రానిక్ వాహనాలను పెంచనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తెలిపారు. ‘ప్రభుత్వ, వివిధ సంస్థల్లో 50% ఈవీలు ఉండేలా పాలసీ తెస్తాం. ప్రభుత్వోద్యోగులు EVలు కొంటే 20% రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఛార్జింగ్, ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నాం’ అని చెప్పారు. 15 ఏళ్లు పైబడిన వాహనాల్ని స్క్రాప్ చేస్తున్నామని, RTCలో ఈవీలను పెంచుతున్నామని తెలిపారు.


