News April 4, 2024
అతి నిద్ర మంచిదేనా? ఎందుకు వస్తుంది?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన, సరిపడినంత నిద్ర అవసరం. అయితే నాణ్యమైన నిద్ర లేనప్పుడే అతి నిద్ర వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీరు రెగ్యులర్గా అతిగా నిద్ర పోతున్నారంటే.. మీ ఆరోగ్యం బాగా లేదని అర్థం. అతిగా నిద్రపోవడం తాత్కాలిక యాంగ్జైటీ, ఊబకాయం, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. ఓవర్ స్లీప్ మెమరీ పవర్ను కూడా ప్రభావితం చేస్తుందట.
Similar News
News April 22, 2025
అద్భుతం.. 10Gbps వేగంతో డౌన్లోడ్

చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటగా 10Gbps వేగంతో పనిచేసే 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ప్రారంభించింది. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్లో టెస్టు చేయగా 9834 Mbps గరిష్ఠ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. ఈ వేగంతో రెండు ఫుల్ 4k క్వాలిటీ సినిమాలను ఒక్క సెకన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ రంగాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.
News April 21, 2025
ఆ చైనా యాప్ తీసేయండి.. గూగుల్కు భారత్ సూచన

చైనాకు చెందిన వీడియో చాటింగ్ యాప్ ‘యాబ్లో’(Ablo)ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్కు భారత ప్రభుత్వం సూచించింది. అందులో భారత భూభాగాల్ని తప్పుగా చూపించడమే దీనికి కారణం. జమ్మూకశ్మీర్, లద్దాక్ను భారత భూభాగాలుగా చూపించని ఆ యాప్, లక్షద్వీప్ను మొత్తానికే మ్యాప్ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే భారత సార్వభౌమత్వాన్ని గౌరవించని ఆ యాప్ను తొలగించాలని గూగుల్కు భారత్ తేల్చిచెప్పింది.
News April 21, 2025
బాబా సిద్దిఖీ కుమారుడిని చంపేస్తామని వార్నింగ్

గతేడాది ముంబైలో హత్యకు గురైన బాబా సిద్దిఖీ కుమారుడు, NCP నేత (అజిత్ పవార్ వర్గం) జీషన్ సిద్దిఖీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. ‘నిన్నూ మీ నాన్న లాగే చంపేస్తాం. రూ.10కోట్లు ఇవ్వు. ప్రతి 6 గంటలకు ఓసారి ఇలాంటి మెయిల్ పంపుతూనే ఉంటాం’ అని వార్నింగ్ ఇచ్చారని ముంబై పోలీసులు వెల్లడించారు. కాగా సిద్ధిఖీని గతేడాది అక్టోబర్ 12న కాల్చి చంపారు. దీనికి తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.