News May 10, 2024

రెచ్చగొట్టడమే రాజకీయమా?

image

నాయకులు తామేం చేశారో, ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. కానీ.. ప్రస్తుతం తెలంగాణలో కొందరు అలా చేయడం లేదు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పర్యవసానాల గురించి ఆలోచించట్లేదు. గతంలో MIM నేత అక్బరుద్దీన్ ‘పోలీసులు పక్కకు జరగండి మాకు 15నిమిషాలు చాలు’ అని నోరు జారితే.. తాజాగా దానికి కౌంటరిస్తూ ‘మాకు 15సెకన్లు చాలు’ అంటూ BJP లీడర్ నవనీత్ కౌర్ అన్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 9, 2026

దూసుకెళ్తున్న భారత్‌.. G20 దేశాల్లో టాప్

image

2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ GDP వృద్ధి 6.4%గా ఉండనుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. G20 దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని వెల్లడించింది. పెట్టుబడులు పెరగడం, స్థిరమైన వృద్ధి దీనికి కారణమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు, ఆదాయపన్ను రాయితీలు కీలకమని పేర్కొంది. మరోవైపు RBI కూడా తొలి రెండు త్రైమాసికాల వృద్ధి అంచనాలను పెంచింది.

News February 9, 2026

ఏపీలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు

image

AP: రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నట్లు పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వేలో వెల్లడైంది. సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9%, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలు రికార్డయినట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అత్యల్పంగా విశాఖలో 3.96%గా ఉంది.

News February 9, 2026

వైకుంఠ పరివారమే ఈ చతుర్విధ అవతారాలు!

image

ధర్మ సంస్థాపన కోసం విష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడు. అయితే విష్ణువు ఒక్కడే కాకుండా ఆయనకు నిరంతరం తోడుగా ఉండే ఆయుధాలు, వాహనం కూడా రాముని సోదరులుగా జన్మించాయి. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాగా ఆయనకు నీడలా ఉండే లక్ష్మణుడు విష్ణువు శయ్య అయిన ఆదిశేషుడి అంశతో జన్మించాడు. భరతుడు విష్ణువు చేతిలోని పాంచజన్యం(శంఖం) అవతారం. శత్రుఘ్నుడు దుష్టసంహారానికి వాడే సుదర్శన చక్రం అంశతో జన్మించాడు.