News July 6, 2024
రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గమా?: పేర్ని నాని

AP: న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు.. రేవంత్, చంద్రబాబు డిమాండ్లు చూస్తుంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోందని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎంల తీరు చూస్తుంటే విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశారు. కాగా మరికాసేపట్లో రేవంత్, చంద్రబాబు ప్రజాభవన్లో భేటీ కానున్నారు. విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చించనున్నారు.
Similar News
News March 29, 2026
కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. అసెంబ్లీలో డిమాండ్!

TG: అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు ఆరోపించారు. కడియం మాట్లాడుతుండగా కౌశిక్ గన్తో కాల్చి పడేస్తానంటూ చేయితో సైగలు చేశారని మండిపడ్డారు. ఆయన్ను ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బీఆర్ఎస్ అగౌరవంగా వ్యవహరిస్తోందని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
News March 29, 2026
ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు!

ఇన్స్టాగ్రామ్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు యువతులు ఇన్స్టాలోని సబ్స్క్రిప్షన్ ఫీచర్ (నెలకు రూ.89-890) ద్వారా యూజర్లకు ప్రైవేట్ ఫొటోలు షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని పేర్కొంటున్నారు. మెటా యాజమాన్యం న్యూడ్ ఫొటోలను నియంత్రిస్తున్నప్పటికీ కొన్నింటిని అడ్డుకోలేకపోతోందని SMలో పోస్టులు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనిపై మీ COMMENT?
News March 29, 2026
అత్తామామల బాధ్యత కోడలిపై ఉండదు: అలహాబాద్ హైకోర్టు

BNSS సెక్షన్ 144 లేదా CrPC సెక్షన్ 125 ప్రకారం కోడలు తన అత్తామామలను పోషించడానికి బాధ్యత వహించరని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. ‘సెక్షన్ 144 ప్రకారం మెయింటెనెన్స్ కోరే హక్కు కొందరికి ఉంది. అత్తామామలు ఆ పరిధిలోకి రారు. వారిని సంరక్షించాలనే నైతికత ఉన్నప్పటికీ చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని పేర్కొంది. కొడుకు చనిపోయినందున కోడలు తమ బాగోగులు చూడాలంటూ వృద్ధులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.


