News January 3, 2025
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ కీలకం?

సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
Similar News
News November 25, 2025
పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.
News November 25, 2025
CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: ccrhindia.ayush.gov.in
News November 25, 2025
ఆ మెసేజ్లు నమ్మొద్దు.. బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్

తన పేరుతో మెసేజ్లు వస్తే నమ్మొద్దని హీరోయిన్ రకుల్ ప్రీత్ సూచించారు. 8111067586 నంబర్తో నకిలీ వాట్సాప్ ఖాతా ఉందని, వెంటనే బ్లాక్ చేయాలంటూ ఫ్యాన్స్ను కోరారు. తన ఫొటోను DPగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి, కొందరు సందేశాలు పంపినట్లుగా గుర్తించినట్లు స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. గతంలోనూ అదితి రావు, రుక్మిణీ వసంత్ వంటి హీరోయిన్లకు ఇదే తరహా అనుభవం ఎదురైంది.


