News January 3, 2025

సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్‌ కీలకం?

image

సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్‌ రిషభ్ పంత్‌కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.

Similar News

News December 2, 2025

NRPT జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

NRPT జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. రాజకీయ పార్టీలు, యువజన, కుల సంఘాలు పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News December 2, 2025

పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు

image

రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు SMలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News December 2, 2025

NRPT జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

NRPT జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. రాజకీయ పార్టీలు, యువజన, కుల సంఘాలు పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.