News April 19, 2024

కాంగ్రెస్ లక్ష్యం అదేనా..?

image

లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 100కు పైగా సీట్లు సాధించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లక్ష్యాన్ని దాటితే 2029 నాటికి మళ్లీ పుంజుకుంటామన్న ఉత్సాహం పార్టీ కేడర్‌లో వస్తుందని నేతలు అంటున్నారు. తమకు, మిత్రపక్షాలకు కలిపి సుమారు 230 వరకు సీట్లు దక్కితే బీజేపీని అడ్డుకునే సామర్థ్యం వస్తుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బలమున్న రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 6, 2025

కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలపై విమర్శలు

image

రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన <<18486026>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీస్తున్నాయి. రూపాయి తన స్థాయిని కనుగొనడం అంటే డాలర్‌కు 100 రూపాయలు దాటడమా అని సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేసి, అధికారంలో ఉన్నప్పుడు సమస్యను చిన్నదిగా చూపడం సరికాదని దుయ్యబడుతున్నారు. ఏమైనప్పటికీ చివరికి ధరలు పెంచి సామాన్యుడినే దోచుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు?

News December 6, 2025

చాట్ జీపీటీతో వ్యవసాయ రంగానికి కలిగే మేలు

image

సాంకేతిక రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లిన ‘చాట్ జీపీటీ’తో వ్యవసాయానికీ మేలే అంటున్నారు నిపుణులు. సాగులో నీళ్లు, ఎరువులు, పురుగు మందులను ఎంతమేర వాడాలి, పంట దిగుబడి పెరగడానికి అవసరమైన సూచనలను ఇది ఇవ్వగలదు. వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను విశ్లేషించి.. పంట దిగుబడికి అవసరమైన సూచనలతో పాటు పంట నష్టం తగ్గించే సూచనలను ఇది అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News December 6, 2025

US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

image

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.