News April 7, 2025

ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడేనా?

image

TG: ఈ నెల 24 లేదా 25న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి, ఆ తర్వాతి 2 రోజుల పాటు మార్కుల ఎంట్రీ, మార్కుల జాబితాల ముద్రణ పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్ సెట్‌కంటే ముందే ఫలితాల్ని వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 20, 2025

దేవ్‌జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

image

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌‌జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్‌‌మెంట్‌‌ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.

News November 20, 2025

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

image

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు ఎక్కువగా వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు నిమ్మ చెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.

News November 20, 2025

మరోసారి KTRను విచారించనున్న ఈడీ?

image

TG: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో KTRను ఈడీ మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్ అనుమతి తీసుకోనుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఏసీబీతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏసీబీ దాఖలు చేసే ఛార్జ్ షీట్‌ను పరిశీలించే అవకాశం ఉంది. అటు ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతించిన సంగతి తెలిసిందే.