News October 4, 2025

అందుకే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారా?

image

వన్డే కెప్టెన్‌గా <<17911822>>గిల్‌ను<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి ముందు రోహిత్‌తో BCCI చర్చలు జరిపింది. 2027 వన్డే WCను దృష్టిలో పెట్టుకొని యువ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. ‘2027 వరకు ఆడతారా?’ అని రోహిత్, కోహ్లీని అడగగా వారు స్పష్టమైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అందుకే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆయనతో పాటు కోహ్లీకి సాధారణ జట్టు సభ్యులుగా చోటు కల్పించింది.

Similar News

News October 4, 2025

భారత్ నా మాతృభూమి: పాక్ మాజీ క్రికెటర్

image

తాను భారత సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలను పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించారు. పాక్ ప్రభుత్వం, PCB తనపై ఎంత వివక్ష చూపినా ఇక్కడి ప్రజలు మాత్రం ఎంతో ప్రేమించారని చెప్పుకొచ్చారు. పాక్ తన జన్మభూమి అయితే, భారత్ మాతృభూమి అని ట్వీట్ చేశారు. ఇండియా ఒక దేవాలయమని అభివర్ణించారు. భవిష్యత్తులో ఆ దేశ సిటిజన్‌షిప్ కావాలనుకుంటే అందుకోసం CAA అమల్లో ఉందని గుర్తు చేశారు.

News October 4, 2025

Inspiration: చెట్టు నేర్పే జీవిత పాఠమిదే!

image

ప్రపంచంలో ప్రతి వస్తువు, జీవి మనకు పాఠాలను నేర్పిస్తూనే ఉంటాయి. చెట్టు కూడా లక్ష్యాలను చేరుకోవడానికి కొన్ని పాఠాలు నేర్పిస్తోంది. సన్‌లైట్ కోసం మొక్క వంగినట్టుగా ఎదగడానికి అవకాశాలున్నప్పుడు దారి మార్చుకోవడానికైనా వెనకాడొద్దు. వేర్లలా కలిసిమెలిసి ఉండటం అలవరుచుకోవాలి. ఆకులు రాల్చినట్లుగా అనవసర విషయాలను వదిలేయాలి. ఎప్పుడో కాసే పండ్ల కోసం చెట్టు ఎదిగినట్లుగా మనమూ లక్ష్యం కోసం కష్టపడుతూనే ఉండాలి.

News October 4, 2025

7న పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశం

image

AP: YCP చీఫ్ జగన్ ఈనెల 7న తాడేపల్లిలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో భేటీ అవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. 8న భీమవరంలో EX MLA ప్రసాదరాజు కుమారుడి పెళ్లికి హాజరవుతారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అడ్డుకొనేందుకు 9వ తేదీన మాకవరపాలెం(M) భీమబోయినపాలేనికి వెళ్తారని పార్టీ పేర్కొంది. అక్కడ నిలిచిపోయిన వైద్య కళాశాలను సందర్శిస్తారు.