News March 29, 2025
యూట్యూబ్ థంబ్నెయిల్స్పై ఫిల్మ్ ఛాంబర్ సీరియస్?

యూట్యూబ్లో తప్పుడు థంబ్నెయిల్స్ పెడుతున్న ఘటనలపై ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్కు చెందిన పలు సంఘాలతో ఛాంబర్ తాజాగా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వాటి స్వార్థం కోసం సినిమా వారిని లక్ష్యంగా చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ గురించి చర్చించినట్లు సమాచారం. అలాంటి యూట్యూబ్ ఛానల్స్పై వచ్చే నెల 1 నుంచి కఠిన చర్యల్ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Similar News
News April 1, 2025
ఈ 3 నెలలు మంటలే.. జాగ్రత్త: IMD

ఈ ఏడాది APR-JUNE మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు నమోదవుతాయని IMD వెల్లడించింది. AP, TG, UP, WB, TN, MP, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, కర్ణాటకలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విద్యుత్ డిమాండ్ 9-10% అధికంగా ఉంటుందని పేర్కొంది. గత ఏడాది మే 30న 250 గిగావాట్ల డిమాండ్ నమోదైన విషయం తెలిసిందే.
News April 1, 2025
నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.
News April 1, 2025
ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం