News January 2, 2025
విదేశీ ప్రయాణాలు చేసేవారిపై ఐటీ శాఖ దృష్టి?

విదేశీ ప్రయాణాలు చేసే భారతీయులపై కన్నేసి ఉంచాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా తయారుచేయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆ సాఫ్ట్వేర్ను ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ప్రయాణికుల టికెట్ల నుంచి తాగే చాయ్ వరకూ మొత్తం అన్ని ఖర్చుల వివరాల్ని ఐటీ శాఖ సేకరించనుంది. పన్ను ఎగవేసి విదేశీ టూర్లు చేసే వారి కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 6, 2026
BREAKING: విజయ్కు సీబీఐ నోటీసులు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.


