News April 5, 2025
పంత్పై రూ.27 కోట్ల ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడి?

IPL చరిత్రలోనే ఖరీదైన ప్లేయర్ రిషభ్ పంత్. రూ.27కోట్లకు LSG దక్కించుకొని కెప్టెన్ను చేసింది. దీంతో అతనిపై అంచనాలు భారీగా పెరగ్గా.. వాటికి అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచుల్లో కేవలం 19 పరుగులే చేశారు. ప్రైజ్ ట్యాగ్తో పాటు జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రతి మ్యాచ్లోనూ అతిగా ఇన్వాల్వ్ అవ్వడమే పంత్ను ఒత్తిడిలోకి నెడుతున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ COMMENT.
Similar News
News December 6, 2025
చాట్ జీపీటీతో వ్యవసాయ రంగానికి కలిగే మేలు

సాంకేతిక రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లిన ‘చాట్ జీపీటీ’తో వ్యవసాయానికీ మేలే అంటున్నారు నిపుణులు. సాగులో నీళ్లు, ఎరువులు, పురుగు మందులను ఎంతమేర వాడాలి, పంట దిగుబడి పెరగడానికి అవసరమైన సూచనలను ఇది ఇవ్వగలదు. వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను విశ్లేషించి.. పంట దిగుబడికి అవసరమైన సూచనలతో పాటు పంట నష్టం తగ్గించే సూచనలను ఇది అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News December 6, 2025
US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.
News December 6, 2025
చెలరేగిన ప్రసిద్ధ్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు

SAతో ODI సిరీస్లో పేలవ బౌలింగ్తో విమర్శలు ఎదుర్కొంటున్న IND బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎట్టకేలకు రిథమ్ అందుకున్నారు. విశాఖలో జరుగుతున్న 3వ ODIలో ఫస్ట్ 2ఓవర్లలో 27రన్స్ సమర్పించుకున్న ఆయన.. తన సెకండ్ స్పెల్లో ఒకే ఓవర్లో బ్రిట్జ్కే, మార్క్రమ్ను, అనంతరం డికాక్(106)ను క్లీన్బౌల్డ్ చేశారు. ప్రస్తుతం 7 ఓవర్లలో 52 పరుగులిచ్చి వికెట్లు పడగొట్టారు. అటు కుల్దీప్ సైతం ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు.


