News June 30, 2024
ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఉందా?: కేంద్ర మంత్రి

బిహార్లో వరుసగా <<13531487>>బ్రిడ్జి<<>>లు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ మీడియాతో అనుమానాలు వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాతే ఎందుకు ఇలా జరుగుతోందని ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఏమైనా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈ ఘటనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. బాధ్యులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


