News February 5, 2025

ప్రణబ్ మెమోరియల్ పక్కనే మన్మోహన్ స్మారకానికి స్థలం?

image

మాజీ PM, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్‌ కోసం కేంద్రం ఢిల్లీలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్ ఘాట్‌ కాంప్లెక్స్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం పక్కనే ల్యాండ్‌ను ఇస్తామని మన్మోహన్ కుటుంబీకులకు తెలిపినట్లు సమాచారం. వారు సమ్మతి తెలపగానే మెమోరియల్ నిర్మాణానికి రూ.25 లక్షలు అందించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది DEC 26న మన్మోహన్ మరణించిన విషయం తెలిసిందే.

Similar News

News December 30, 2025

బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

image

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్, ఇత‌ర గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటిపళ్లు, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవ‌న శైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దిన‌చ‌ర్య‌లో భాగంగా చేసుకోవాలి.

News December 30, 2025

సిరియా కొత్త కరెన్సీ నోట్లను చూశారా?

image

సిరియా ఆర్థిక వ్యవస్థలో భారీ <<14825249>>మార్పులు<<>> చోటుచేసుకున్నాయి. జనవరి 1 నుంచి కొత్త సిరియన్ పౌండ్ నోట్లను చలామణిలోకి తెస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నోట్లపై ఉన్న బషర్ అల్-అసద్ చిత్రాలను పూర్తిగా తొలగించింది. నోట్లపై గోధుమలు, పత్తి, ఆలివ్స్, ఆరెంజ్ చిహ్నాలను ముద్రించింది. పాత కరెన్సీ విలువ కోల్పోవడంతో ఆర్థిక స్థిరత్వం కోసం ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.

News December 30, 2025

T20 WCకు ఇంగ్లండ్ టీమ్.. హిట్టర్‌కు నో ఛాన్స్

image

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న T20 WCనకు ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా 16 మందితో టీమ్‌ను అనౌన్స్ చేసింది. హిట్టర్ లివింగ్‌స్టోన్‌కు జట్టులో చోటు దక్కలేదు.
టీమ్: హ్యారీ బ్రూక్(C), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, కార్సే, సామ్ కరన్, లియం డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జెమీ ఓవర్టన్, రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.