News July 21, 2024
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా?: అంబటి

AP: ముచ్చుమర్రి బాలిక హత్యాచారం ఘటనలో మృతదేహాన్ని ఇంకా ఎందుకు కనిపెట్టలేకపోయారో హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని YCP నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఓ దళిత వ్యక్తి లాకప్ డెత్ అయ్యారు. దీనిపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పుంగనూరులో MP మిథున్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. APలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? YCP నేతలపై దాడులకు తెగబడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News December 4, 2025
డెస్క్ వర్క్ చేసే వాళ్లకి ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు

నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య ఫ్రోజెన్ షోల్డర్. చేతిని పైకి ఎత్తినా, కాస్త వేగంగా కదిలించినా నొప్పి వస్తుంది. పడిపోవడం, దెబ్బ తగలడం లేదా ఎక్సర్సైజులు చేయడం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. డెస్క్లో కూర్చుని పనిచేసే వాళ్లకు ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు ఎక్కువని సర్వేలో తేలింది. డయాబెటిస్, హైపోథైరాయిడిజం, గుండె జబ్బుల బాధితులకు ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనిని అథెసివ్ క్యాప్సులైటిస్ అంటారు.
News December 4, 2025
ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.
News December 4, 2025
భారత్ చేరుకున్న రష్యా డిఫెన్స్ మినిస్టర్.. కాసేపట్లో పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో భారత్కు రానున్న నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్తో కలిసి ఆయన భారత్-రష్యా 23వ సమ్మిట్లో పాల్గొంటారు. భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో ఆండ్రీ భేటీ అవుతారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. అటు పుతిన్ భారత్కు చేరుకున్నాక ప్రెసిడెంట్ ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.


