News February 1, 2025

రంజీ మ్యాచ్‌కి ఇంత క్రేజా?

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో ఢిల్లీ vs రైల్వేస్‌ రంజీ మ్యాచ్‌కి భారీగా క్రేజ్ పెరిగింది. ఈ రంజీ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న ‘జియో సినిమా’కు అభిమానులు పోటెత్తారు. ఆయన ఆడుతున్న ఈ మ్యాచ్‌కి మాత్రమే కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇది 1.8 కోట్ల వ్యూస్‌తో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన రంజీ మ్యాచ్‌‌గా నిలచింది. కోహ్లీ కోసం స్టేడియానికి కూడా అభిమానులు భారీగా తరలివస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News February 10, 2026

శ్రీశైలం మల్లన్న దర్శనానికి 4 గంటలు

image

AP: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం 12pm వరకు 32,870 మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 14,280మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. 12,931మంది శివస్వాములు స్పర్శ దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పెరిగిన రద్దీ కారణంగా మల్లన్న దర్శనానికి 4గంటల టైమ్ పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

News February 10, 2026

రాహుల్ చూపించిన ఆ బుక్‌లో ఏముంది..?

image

MM నరవణె బుక్‌లోని ‘గల్వాన్ దాడి’ గురించి CARAVAN మ్యాగజైన్ పోస్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం ‘చైనా సేన మన స్థావరాలకు 1km దూరంలో మోహరించింది. కానీ స్పష్టమైన ఆదేశాల్లేకుండా కాల్పులు చేయొద్దని ఢిల్లీ నిబంధన. దీంతో రక్షణ మంత్రి, NSA, MEAలకు ఫోన్లో విషయం చెప్పా. కాసేపటికి DM ఫోన్ చేసి మోదీతో మాట్లాడా ‘ఏది మంచిదన్పిస్తే అది చేయండి’ అన్నట్లు చెప్పారు. దీంతో PMకు స్పష్టత లేదు అన్పించింది’ అని MM భావించారట.

News February 10, 2026

IPLకూ హర్షిత్ రాణా డౌటే!

image

టీమ్ ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా సోమవారం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ నుంచి మాత్రమే కాకుండా త్వరలో రాబోయే IPL సీజన్ నుంచి కూడా ఆయన దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా గాయపడ్డారు. త్వరలో బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయనున్నారు.