News February 1, 2025
రంజీ మ్యాచ్కి ఇంత క్రేజా?

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో ఢిల్లీ vs రైల్వేస్ రంజీ మ్యాచ్కి భారీగా క్రేజ్ పెరిగింది. ఈ రంజీ మ్యాచ్ను ప్రసారం చేస్తున్న ‘జియో సినిమా’కు అభిమానులు పోటెత్తారు. ఆయన ఆడుతున్న ఈ మ్యాచ్కి మాత్రమే కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇది 1.8 కోట్ల వ్యూస్తో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన రంజీ మ్యాచ్గా నిలచింది. కోహ్లీ కోసం స్టేడియానికి కూడా అభిమానులు భారీగా తరలివస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2026
మండలి నుంచి YCP వాకౌట్

AP: శాసన మండలి నుంచి YCP సభ్యులు వాకౌట్ చేశారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండలిలో చెప్పారు. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదని, తమ నిరసన ద్వారా పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమేనని వివరించారు.
News February 13, 2026
First Time: ట్రాన్స్జెండర్ విజయం

TG: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ట్రాన్స్జెండర్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి నగేశ్పై ఇండిపెండెంట్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్జెండర్) 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్గా గెలుపొందారు. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
News February 13, 2026
వంటింటి చిట్కాలు మీ కోసం..

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.


