News October 27, 2024
దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు: జగన్
AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.
Similar News
News October 27, 2024
అత్యుత్తమ టెస్టు జట్టులో రోహిత్ ఓపెనర్గా ఉంటారు: స్మిత్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆటగాళ్లతో అత్యుత్తమ టెస్టు జట్టును తయారుచేస్తే దానికి ఓపెనర్గా తాను రోహిత్నే ఎంచుకుంటానని తెలిపారు. ‘రోహిత్ చాలా ప్రమాదకర ప్లేయర్. నిర్భయంగా తన షాట్స్ ఆడతారు. అవసరమైతే అద్భుతంగా డిఫెండ్ కూడా చేసుకోగలరు. అతడు క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు’ అని పేర్కొన్నారు.
News October 27, 2024
IASలకు పోస్టింగ్స్.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి
AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది.
*టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
*వైద్యారోగ్యశాఖ కమిషనర్గా వాకాటి కరుణ
*జీఏడీలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్
*కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్
**మరో ఐఏఎస్ రొనాల్డ్ రోస్కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
News October 27, 2024
ఇజ్రాయెల్కు మన పవర్ చూపాలి: ఖమేనీ
ఇజ్రాయెల్కు తమ సత్తా ఏంటో చూపాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారులను ఆదేశించినట్లు IRNA తెలిపింది. ‘మనపై జరిగిన దాడులను తక్కువ చేసి చూడొద్దు. ఎక్కువగానూ భావించొద్దు. దేశానికి మేలు జరిగే అనువైన మార్గాన్ని అధికారులే నిర్ణయించాలి’ అని ఆయన వారితో చెప్పినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్పై శక్తివంతమైన దాడి చేశామని, తమ లక్ష్యాలను పూర్తిగా సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.