News September 12, 2024
బంగ్లాతో తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే?

ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా తుది జట్టు ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
Similar News
News August 24, 2025
సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీలో స్పష్టత రానుంది. BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. నెలాఖరులో పోలింగ్ జరగొచ్చని సమాచారం. కాగా ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక, న్యాయ సలహా మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనుంది.
News August 24, 2025
తుర్కియే, అజర్బైజాన్ దేశాలకు షాకిచ్చిన ఇండియన్స్

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్కు సపోర్ట్ చేసిన అజర్బైజాన్లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్తో పోలిస్తే 60% తగ్గింది.
News August 24, 2025
ఎల్లుండి నుంచి స్పాట్ అడ్మిషన్లు

TG: JNTUతో పాటు అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు ఈ నెల 26 నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 26న వర్సిటీ క్యాంపస్, సుల్తాన్పూర్, 28న జగిత్యాల, మంథని, 29న వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయా కాలేజీల్లో సీట్లు కావాల్సిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.