News November 9, 2024
ఇదేనా మీరు తెచ్చిన మార్పు?: హరీశ్ రావు

TG: రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోకుండా CM, మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఉత్తమ్ సొంత జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జరగవు. బిల్లులు రాక పంచాయతీ ఆఫీస్ తాకట్టు పెడుతున్నా భట్టి పట్టించుకోరు. మద్దతు ధర లేక పత్తి రైతులు కన్నీళ్లు పెడుతున్నా సీతక్క కనికరించరు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా రేవంత్ నిద్ర వీడరు. ఇదేనా మీరు చెప్పిన మార్పు?’ అని ఫైరయ్యారు.
Similar News
News October 21, 2025
పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తున్నారా?.. జాగ్రత్త!

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే తిప్పలు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ దాటితే IT శాఖ నుంచి నోటీసులొస్తాయని, భారీ ఫైన్లు విధిస్తారని చెబుతున్నారు. ‘₹20 వేలకు మించి నగదును రుణంగా ఇవ్వకూడదు/తీసుకోకూడదు. ఒకేరోజు ₹2 లక్షలు/అంతకంటే ఎక్కువ నగదు తీసుకోడానికి పర్మిషన్ లేదు. వీటిపై 100% పెనాల్టీ విధించే చాన్స్ ఉంది’ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుందంటున్నారు.
News October 21, 2025
కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.
News October 21, 2025
బొద్దింకను చంపబోయి మహిళ చావుకు కారణమైంది!

దక్షిణ కొరియాలో యువతి చేసిన పిచ్చి పని ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒసాన్ నగరంలో తన ఇంట్లోకి వచ్చిన బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రేను ఉపయోగించింది. ఈ క్రమంలో తన ఫ్లాట్కే నిప్పుపెట్టుకుంది. తర్వాత మంటలు మొత్తం అపార్ట్మెంట్కు వ్యాపించాయి. ఈ ఘటనలో పొరుగున ఉండే మహిళ చనిపోగా, ఆమె భర్త, 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. 30కిపైగా నివాసాలున్న బిల్డింగ్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.