News June 29, 2024

రోహిత్ శర్మ, కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్?

image

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇవాళ జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి మ్యాచ్ అని తెలుస్తోంది. గెలిచినా, ఓడినా వీరిద్దరికీ ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వన్డే, టెస్టుల్లో ఇంకెన్నాళ్లు కొనసాగుతారో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Similar News

News December 5, 2025

అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్‌<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు.

News December 5, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్‌ హబ్‌కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90.43కి పతనం

News December 5, 2025

క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

image

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.