News January 23, 2025
నూతన DGP ఈయనేనా?

AP: DGP ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో కొత్త DGP ఎవరనే చర్చ జరుగుతోంది. నూతన DGPగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ DGగా ఉన్నారు. ఎన్నికలప్పుడు హరీశ్ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే. పదవీకాలం పొడిగింపు కోసం తిరుమలరావు, పోలీస్ బాస్ పోస్ట్ కోసం CID DG రవిశంకర్ పోటీలో ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 28, 2026
మేడారం జాతర.. ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు

TG: మేడారం జాతర సందర్భంగా ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనికి బదులు ఫిబ్రవరి 14 (రెండో శనివారం) పనిదినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
News January 28, 2026
హైదరాబాద్ సీసీఎంబీలో 80 పోస్టులు

HYDలోని CSIR-CCMB 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ/NTC/STC, డిప్లొమా, BE/BTech, BSc/MSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెక్నీషియన్కు నెలకు రూ.39,545, tech. assist.కు రూ.72,240, tech. ఆఫీసర్కు రూ.90,100 చెల్లిస్తారు. వెబ్సైట్: www.ccmb.res.in/
News January 28, 2026
‘రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం’.. పవార్ మృతిపై రాజ్ ఠాక్రే

అజిత్ పవార్ మృతిపై MNS చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన కామెంట్లు చేశారు. రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇది తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. ‘అజిత్ ముక్కుసూటిగా ఉంటారు. హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన శైలి కాదు. దీని వల్ల తను ఎంత మూల్యం చెల్లించుకున్నారో ఊహించుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అటు <<18982388>>విమాన ప్రమాదంపై<<>> మమతాబెనర్జీ అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే.


