News March 7, 2025
కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారత ఇదేనా?: YS షర్మిల

మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ ఫ్రీ అంటూ ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం దారుణం. పథకం అమల్లోకి వచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పించే మహిళా సాధికారిత ?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 6, 2026
శుక్ర దోష నివారణ మార్గాలు

శుక్ర దోష నివారణ కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పఠనం చేయాలి. తెల్లని వస్తువులు దానం చేస్తే శుభం కలుగుతుంది. పాలు, పెరుగు, బియ్యం, పంచదార, తెలుపు వస్త్రాలు పేదలకు దానం చేయాలి. ‘ఓం శుం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం, తెలుపు దుస్తులు ధరించడం మంచిది. సుగంధ ద్రవ్యాలు వాడితే శుక్రుడు ప్రసన్నమవుతాడని నమ్మకం.
News February 6, 2026
పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.
News February 6, 2026
పచ్చిపేడను ఎలా మగ్గబెడితే మంచిది?

ముందుగా పశువుల నుంచి వచ్చే పేడను ఒక దగ్గర వేయాలి. అందులో కాస్త తేమ ఉండేందుకు కొద్దిగా నీళ్లను చల్లుతూ ఉండాలి. పేడ బాగా మగ్గాలంటే కుప్పపై గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవరును గట్టిగా కప్పి ఉంచాలి. ఇలా 2 నుంచి 3 నెలల పాటు ఉంచి మధ్యలో అప్పుడప్పుడు కుప్పను పైకి కిందకు తిరగేయాలి. దీని వల్ల ఎరువు సమానంగా కుళ్లి మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన పశువుల ఎరువును వాడితే నేలసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.


