News March 19, 2024
వంగవీటి రాధా ప్రచారానికే పరిమితమా? పోటీ చేస్తారా?

AP: ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన తరఫున వంగవీటి రాధా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుగుతారని సమాచారం. అయితే టీడీపీలో టికెట్ దక్కనందున జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్, ఇవాళ ఎంపీ బాలశౌరితో సమావేశం కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
Similar News
News August 28, 2025
నదుల అనుసంధానం చేస్తాం: ఆనం

AP: గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి CM చంద్రబాబు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం రూ.84వేల కోట్లతో ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలోకి పోయే జలాలపై రాజకీయ లబ్ధి కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నుంచి వచ్చే జలాలను సోమశిల, కండలేరులో 150 TMCల చొప్పున నిల్వ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
News August 28, 2025
బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న ‘అఖండ 2’ మూవీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో పోస్ట్పోన్ చేయక తప్పడం లేదని వివరించింది. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
News August 28, 2025
US టారిఫ్స్కు GSTతో చెక్: BMI

ఇండియాపై US టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ‘ఈ దశాబ్దం చివరికి IND GDP 6%పైనే ఉంటుంది. 2010-19 యావరేజ్(6.5%)తో పోలిస్తే కొంతే తక్కువ. అయినా ASIAలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్లో INDనే టాప్. GST 2శ్లాబుల విధానం, ఆదాయపన్ను కోతలతో కొనుగోళ్లు రూ.5.31 లక్షల కోట్లకు చేరుతాయని SBI అంచనా. ఇవన్నీ గ్రోత్పై టారిఫ్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపింది.