News October 29, 2024
ఈ లిస్ట్లో మీ మండలం ఉందా?

AP: ఖరీఫ్ సీజన్లో 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరవు, మరో 27 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. ఈ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పింది. పైనున్న ఇమేజ్లో మీ మండలం ఉందా?
Similar News
News February 10, 2026
రేపు సెలవు

TG: రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మికశాఖ రేపు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో రేపు 7AM నుంచి 5PM వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో పోలింగ్ ముగిసే వరకూ మద్యం షాపులు మూసి ఉంటాయి.
News February 10, 2026
స్థిరంగా బంగారం, వెండి ధరలు

కొన్నిరోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,57,910, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,44,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.3 లక్షలుగా ఉంది.
News February 10, 2026
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


