News August 4, 2024
దేశవాళీ క్రికెట్లో ఆడనున్న ఇషాన్ కిషన్?

టీమ్ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడనున్నారట. ఝార్ఖండ్ తరఫున ఆడనున్న కిషన్, ఆ జట్టుకు కెప్టెన్సీ కూడా చేసే ఛాన్సుందని cricbuzz పేర్కొంది. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న నేషనల్ సెలక్టర్ల సూచనతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2023 ODI WC తర్వాత SA పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న కిషన్, ఆ తర్వాత BCCI <<13558094>>కాంట్రాక్ట్<<>> కోల్పోయారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


