News July 27, 2024
అమర్నాథ్ యాత్రపై ఐఎస్ఐ కుట్ర

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రపై ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు ఖబ్బర్ ఖల్సాతో కలిసి ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కనుగొంది. పంజాబ్లోని ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లతో కలిసి ఐఎస్ఐ ఈ కుట్రకు ప్లాన్ చేసిందని గుర్తించింది. ఇటీవల పంజాబ్లోని పఠాన్కోట్ ప్రాంతంలో ఉగ్ర కదలికలను ఇంటెలిజెన్స్ గుర్తించింది. అలాగే భద్రతా దళాలపై దాడుల వెనుక పాక్ కుట్ర ఉందని భావిస్తోంది.
Similar News
News October 31, 2025
RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్సైట్: https://www.rites.com
News October 31, 2025
దేహంలో దాగి ఉన్న పంచభూతాల లీల

‘ఓం నమ:శివాయ’ అనే 5 అక్షరాలతో మనం శివుణ్ని కొలుస్తాం. ఈ పంచాక్షరీ మంత్రమే పంచభూతాలు కూడా. ఈ పంచభూతాల ఆధారంగానే మన శరీరం నిర్మితమైంది. దీనికి సూచనగా దేవుడు మన చేతికి, కాలికి సహజంగానే ఐదు వేళ్లను ఏర్పరిచాడు! ఆధ్యాత్మిక రహస్యాల్లో ఇదొకటి. మనిషి ఐదు వేళ్లను కలిగి ఉండటం, ఐదు భూతాలతో తయారవడం… ఇదంతా సృష్టికర్త మనకిచ్చిన దివ్య సంకేతం. మన శరీరమే పరమేశ్వరుని సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అద్భుత రహస్యం! <<-se>>#SIVA<<>>
News October 31, 2025
కేజ్రీవాల్ మరో శీష్ మహల్ కట్టుకున్నారు: బీజేపీ

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు మరో శీష్ మహల్ ఉందని BJP ఆరోపించింది. ఢిల్లీ మహల్ను ఖాళీ చేశాక చండీగఢ్లో 7 స్టార్ బంగ్లాను కేజ్రీవాల్ నిర్మించారని ట్వీట్ చేసింది. 2 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిందని చెప్పింది. ఓ ఏరియల్ ఫొటోను షేర్ చేసింది. ఢిల్లీలో CM నివాసాన్ని ₹45 కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్గా మార్చుకున్నారని గతంలో కేజ్రీవాల్పై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.


