News July 24, 2024
వెంటనే అంటే 8 నెలలు సరిపోదా?: హరీశ్

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి, BRS MLA హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ‘ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి వెంటనే రెండు PRCలు ఇస్తామని, వారి డిమాండ్లు పరిష్కరిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చెప్పింది. వెంటనే అంటే 8 నెలలు సరిపోదా?’ అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 18, 2025
పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
News November 18, 2025
పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
News November 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 70

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


