News October 11, 2025
మావోయిస్టుల కొత్త దళపతి దేవ్జీ కాదా?

మావోయిస్టుల సారథి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించాక కొత్త చీఫ్ ఎవరనే దానిపై గందరగోళం నెలకొంది. జగిత్యాల (TG) జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించారని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ దళానికి సెక్రటరీని ఇంకా నియమించలేదని, పార్టీలో విభేదాలున్నాయని లొంగిపోయిన మావోలు చెప్పడం గమనార్హం. కీలక నేతల లొంగుబాటు, మల్లోజుల లేఖల నేపథ్యంలో పార్టీ దళపతిగా ఎవరొస్తారనేది కీలకంగా మారింది.
Similar News
News October 11, 2025
రేపు ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ CLSకు శంకుస్థాపన

AP: మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖలో సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఇండియాతో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ CLS వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్గా పనిచేయనుంది.
News October 11, 2025
పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ లక్ష్యాలివే..

పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రధాని మోదీ పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ను ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం కింద 2030-31 నాటికి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 275 నుంచి 310 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే కేంద్రం లక్ష్యం. పప్పు ధాన్యాల ఉత్పత్తి 242 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం, హెక్టారుకు పంట ఉత్పాదకత 881 KGల నుంచి 1,130 KGలకు పెంచడం కేంద్రం లక్ష్యం.
News October 11, 2025
అతడికి సపోర్ట్గా నేనున్నా: గంభీర్

టీమ్ ఇండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఇప్పటిదాకా తన బాధ్యతను సరిగ్గా హ్యాండిల్ చేశారని కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు గిల్ ఎలా స్పందిస్తాడో చూడాలని ఉంది. అతడికి సపోర్ట్గా నేనున్నాను. ప్రొటెక్ట్ చేస్తాను. గిల్ పరిణతి సాధించే వరకు అతడిపై వచ్చే ఎలాంటి విమర్శలనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు.