News December 3, 2024
మసీదు స్పీకర్లపై ఇజ్రాయెల్ నిషేధం

దేశంలోని మసీదులపై మైకుల వినియోగాన్ని నిషేధిస్తూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ భద్రత మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ట్విటర్లో తెలిపారు. ‘మసీదుల మైకులు ఇజ్రాయెల్ పౌరులకు ప్రమాదకరంగా మారాయి. పశ్చిమ, అరబ్ దేశాల్లో మైకులపై పరిమితులున్నాయి. ఇజ్రాయెల్లోనే చట్టం లేదు. ప్రార్థించడం ప్రాథమిక హక్కే కానీ అది వేరే వారి జీవన నాణ్యతను దెబ్బతీయరాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2026
భర్తకు తీవ్ర అనారోగ్యం.. శ్మశానంలో వదిలివెళ్లిన భార్య!

TG: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ఫలితం లేకపోయింది. అద్దె ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ ఒత్తిడి, ఇద్దరు పిల్లల బాధ్యతతో శ్రీధర్ను భార్య శ్మశానంలో వదిలి పుట్టింటికి వెళ్లింది. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు.
News March 21, 2026
జెన్యూన్ హీరోలు లేరు: తాప్సీ

కథకు ప్రాధాన్యమిచ్చి, తమ పాత్ర పరిధి ఎంత ఉన్నా నటించే జెన్యూన్ హీరోలు ప్రస్తుతం లేరని నటి తాప్సీ అన్నారు. ‘హీరోయిన్ పాత్ర ఎక్కువ ఉంటే నటించేందుకు చిన్న హీరోలు కూడా ముందుకు రావడం లేదు. హీరోయిన్ హైలైట్ అయితే తమ ఇమేజ్ దెబ్బతింటుందనేది వారి భావన. ఇలా అయితే మంచి కథలు ఎలా వస్తాయి. కథానాయికలు పాటలకే పరిమితం కావాలనే పాతకాలపు ఆలోచన నుంచి బయటికి రావాలి’ అని పిలుపునిచ్చారు.
News March 21, 2026
భక్తులకు అల్పాహారం వడ్డించిన చంద్రబాబు

AP: తిరుమలలో భక్తులకు సీఎం చంద్రబాబు అల్పాహారం వడ్డించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఆయన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ CBN, భువనేశ్వరి, లోకేశ్, దేవాన్ష్ వడ్డించారు. తర్వాత వారు అల్పాహారం స్వీకరించారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. ఏటా తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందజేస్తున్నారు.


