News October 2, 2024

దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్ర‌క‌టించింది. పౌరులు బాంబు షెల్టర్‌లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్‌లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్ర‌క‌ట‌నలు జారీ చేసింది.

Similar News

News October 2, 2024

చెత్తలో దొరికిన పెయింటింగ్.. విలువ రూ.46 కోట్లు!

image

62 ఏళ్ల క్రితం ఇటలీలోని ఓ ఇంటిని కొన్న వ్యక్తి చెత్తను శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్ దొరికింది. అదేదో పిచ్చి బొమ్మ అనుకుని పక్కన పెట్టేశారు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ యజమాని కుమార్తె దాన్ని పికాసో కళాఖండంగా గుర్తించారు. అనంతరం దాని విలువ రూ.46 కోట్లని తెలిసి షాకయ్యారు. ప్రస్తుతం దాన్ని ఓ లాకర్‌లో భద్రపరిచామని, ఏం చేయాలన్నదానిపై పికాసో ఫౌండేషన్‌తో మాట్లాడుతున్నామని వారు తెలిపారు.

News October 2, 2024

కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ రాజీనామా

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (టీ20, ODI) కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నారు. తన బ్యాటింగ్, పర్సనల్ గ్రోత్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కెప్టెన్సీ వల్ల వర్క్ లోడ్ పెరిగిందని పేర్కొన్నారు. 2019లో టీ20, 2020లో ODI, టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న బాబర్ 2023 ODI WC తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. మళ్లీ 2024 టీ20 WCకి ముందు కెప్టెన్ అయ్యారు.

News October 2, 2024

నితీశ్ కుమార్ ఫిట్‌గా లేరు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా లేరని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో BJP తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నితీశ్‌కు ఆసరా ఇస్తోందని దుయ్య‌బట్టారు. ప్ర‌జా జీవితం నుంచి త‌ర‌చుగా ఆయ‌న గౌర్హాజ‌రు, భూ స‌ర్వే, వ‌ర‌ద‌లు, స్మార్ట్ మీట‌ర్ల బిగింపు వంటి కీల‌క విష‌యాల‌పై మౌనాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకొని నితీశ్ ఆరోగ్యాన్ని అంచ‌నా వేస్తున్నట్టు పేర్కొన్నారు.